కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్

80చూసినవారు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిషెక్‌లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస చెలరేగడంతో ఎవరు బయటకు రావొద్దని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా 0555710041 నంబరును షేర్ చేసింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణ వీడియోలు వైరల్ కావటం దాడులకు దారితీసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్