ఉపాధి వేతనదారులకు మరింత ఆదాయం వచ్చేలా చర్యలు

68చూసినవారు
ఉపాధి వేతనదారులకు మరింత ఆదాయం వచ్చేలా చర్యలు
ఎన్దియే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కువ పనిదినాలు కల్పించడం ద్వారా మరింత ఆదాయం చేకూరెలా చేయడం జరుగుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాధరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సిలగాం సింగువలసలో పలు చెరువుల వద్ద మాజీ సర్పంచ్ కంచు దశరద ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి వేతనదారులతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.