ఆది ఆంధ్రా వీధిలో రోడ్డు పైకి చేరిన మురుగు నీరు

61చూసినవారు
టెక్కలి మండల కేంద్రం లోని ఆది ఆంధ్రా వీధిలో శనివారం మురుగు నీరు వీధి రోడ్లపై ప్రవహించింది. దీంతో స్థానికులు మురుగు కాలువల్లో చెత్తనిల్వలను బయటకు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీధిలోని మురుగు నీటి కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో శనివారం కురిసిన వర్షానికి డ్రైనేజీలు నిండి బయటకు వచ్చింది. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్