![](https://media.getlokalapp.com/cache/8f/db/8fdb93463d728ba808ec5da04f8ed010.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
శోకసంద్రంలో జవాన్ కుటుంబం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రకు చెందిన జవాన్ డొక్కరి రాజేశ్ (25) మరణంతో గ్రామంలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఉగ్రవాదుల దాడుల్లో జవాన్ మృతితో కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబసభ్యులను గ్రామస్థులు ఓదార్చారు. కాగా జవాను వీరమరణంపై జిల్లాలోని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.