నలుగురు అభ్యర్థులను మార్చిన టీడీపీ

83097చూసినవారు
నలుగురు అభ్యర్థులను మార్చిన టీడీపీ
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అభ్యర్థులను టీడీపీ మార్చింది. తాజా మార్పుల ప్రకారం ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు, అనకాపల్లి జిల్లా మాడుగులలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్ఎస్ రాజుకు ఇవ్వనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చబోతున్నట్లు అధినాయకత్వం ప్రకటించింది.