దేవాలయాలను చంద్రబాబే కూల్చారు: వెల్లంపల్లి

78చూసినవారు
దేవాలయాలను చంద్రబాబే కూల్చారు: వెల్లంపల్లి
ఏపీలో దేవాలయాలను టీడీపీ అధినేత చంద్రబాబే కూల్చారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘రామతీర్థం, అంతర్వేది పూర్వ వైభవం తీసుకొచ్చింది సీఎం జగనే. రూ.70 కోట్ల నిధులతో ఇంద్రకీలాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. చంద్రబాబు హయాంలో ఆలయాలు ధ్వంసమయ్యాయి. చంద్రబాబు బూట్లు వేసుకొని పూజలు చేసే వ్యక్తి. శ్రీరామ నవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబే.’ అని అన్నారు.