ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత (వీడియో)

60చూసినవారు
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట పట్టణంలోని క్రిస్టియన్ పేటలో రెండు వర్గాలు దారుణంగా కొట్టుకున్నారు. పాత గొడవలను మనసులో పెట్టుకుని మద్యం సేవించి ఇళ్ల మీదకు ఒక వర్గం గొడవకు దిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించారు. అడ్డుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 17 మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్