విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప పార్లమెంట్ స్థానానికి పొటీ చేశానని తెలిపారు. తాను కడపలో కేవలం 14 రోజులే ప్రచారం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తునట్లు చాలా మందికి తెలియదన్నారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు విపరీతంగా డబ్బులు పంపిణీ చేశారని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీకి ప్రజలు భయపడ్డారని చెప్పారు.