YCP కేడర్‌లో టెన్షన్ పెంచుతున్న నేతల మాటలు

53చూసినవారు
YCP కేడర్‌లో టెన్షన్ పెంచుతున్న నేతల మాటలు
ఏపీ ఎన్నికల వార్ లో ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలింగ్ అనంతరం వైసీపీ ముఖ్య నేతలు మాట్లాడిన మాటలు వైసీపీ శ్రేణులను టెన్షన్ కు గురి చేస్తుంది. పోలీసులు, అబ్జర్వర్లు టీడీపీతో కుమ్మక్కయారని సజ్జల అన్నారు. టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరించారని మాజీ మంత్రి అనిల్ ఆరోపించారు. పోలీసుల తీరు టీడీపీకి అనుకూలంగా ఉందంటూ మంత్రి అంబటి విమర్శలు చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నామో లేదో అర్థం కాలేదని అంబటి వ్యాఖ్యనించారు. దీంతో వైసీపీ నేతల మాటల్లో ఓటమి భయం కనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్