ఇటీవల పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ డీఐజీ అండ్ బీజాపూర్ ఎస్పీ సమక్షంలో మంగళవారం వారంతా లొంగిపోయారు.