అసెంబ్లీలో మూడు తరాలు

70చూసినవారు
అసెంబ్లీలో మూడు తరాలు
ఏపీ ఎన్నికల చరిత్రలో రెండు కుటుంబాలకు చెందిన మూడు తరాల వ్యక్తులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పెందుర్తి నుంచి 1978లో గుడివాడ అప్పన్న, 1989లో ఆయన కుమారుడు గురునాథరావు, 2019లో అనకాపల్లి నుంచి ఆయన మనవడు అమర్ నాథ్ విజయం సాధించారు. అలాగే ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా 1955లో పర్వత గుర్రాజు, 1994లో ఆయన కుమారుడు పర్వత సుబ్బారావు, 1999లో గుర్రాజు కోడలు బాపనమ్మ, 2009లో ఆయన మనవడు సత్యనారాయణ మూర్తి గెలిచారు.