గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ

52చూసినవారు
గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ
తొలిసారి బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది. అప్పట్లోనే రూ.450కు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఆ లడ్డూను అతడు తన కుటుంబ సభ్యులకు పంచి.. మిగిలిన దానిని తన పొలంలో చల్లుకోవడంతో ఆయనకు బాగా కలిసి వచ్చినట్లు అతడే తెలిపాడు. అలా.. ఏడాదికి ఏడాది ఈ వేలం పెరుగుతూ వస్తోంది. గతేడాది రూ.27 లక్షలకు దాసరి దయానందరెడ్డి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఈ లడ్డూ వేలం రూ.30 లక్షలకు పైగా పలకొచ్చనేది అంచనా.

సంబంధిత పోస్ట్