స్కూటర్ ను ఢీకొన్న ట్రాక్టర్.. వ్యక్తికి గాయాలు

64చూసినవారు
స్కూటర్ ను ఢీకొన్న ట్రాక్టర్.. వ్యక్తికి గాయాలు
స్కూటర్ ను ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి గాయపడిన సంఘటన మంగళవారం పాకాల మండలంలో చోటుచేసుకుంది. పాకాల మండలంలోని దామలచెరువు మ్యాంగో నగర్ వద్ద పూతలపట్టు మండలం గాండ్లపెంట గ్రామానికి చెందిన జనార్దన్ నాయుడు స్కూటర్ పై వెళ్తుండగా మామిడికాయల లోడ్ తో వస్తున్న ట్రాక్టర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో జనార్ధన్ నాయుడుకి కాలు విరిగింది. పోలీసులు క్షతగాత్రున్ని వైద్యం నిమిత్తం తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు.