నానికి ప్రాణ హాని కలిగించే ఉద్దేశ్యం తమకు లేదు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై చేసిన దాడికి ప్రతి దాడిగా పులివర్తి నాని వాహనంపై దాడి చేశామని, నానికి ప్రాణ హాని కలిగించే ఉద్దేశ్యం తమకు లేదని రామచంద్రాపురం జడ్పీటీసీ, వైసీపీ నేత భాను కుమార్ రెడ్డి సతీమణి ఢిల్లీరాణి స్పష్టం చేశారు. శనివారం తిరుపతి రూరల్ మండలం ఓ ప్రైవేట్ హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ గొడవలకు టీడీపీ నేతలే కారణమన్నారు. ఐదేళ్లలో సీఎం జగన్ అందరికి సంక్షేమ పథకాలు అందించారన్నారు.