పెరుగుతున్న డ్రగ్స్వినియోగాన్ని అరికట్టాలంటూ యూత్ అసోసియేషన్ సభ్యులు పట్టణ పరిధిలో ర్యాలీ నిర్వహించారు.బుధవారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా ఏకాంబరకుప్పం రైల్వేస్టేషన్ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టాలని నినాధాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి సీఐ సురేష్ అతిధిగా పాల్గొన్నారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.