పిడుగు పడి ఇద్దరి మృతి

82చూసినవారు
తిరుపతి జిల్లాలో వర్షాలు విషాదాన్ని నింపాయి. సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏఏడబ్ల్యు లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈక్రమంలోనే భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. పొలాల్లో పని చేసుకుంటున్న మణి(54), రాము(55) అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను మంచాలపై మోసి ఇంటికి తీసుకు వచ్చారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :