
సత్యవేడులో జూన్ 11, 12 వ తేదీల్లో గంగ జాతర
సత్యవేడు పట్టణంలో జూన్ 11, 12వ తేదీల్లో గంగజాతర నిర్వహించడానికి జాతర నిర్వాహకుల కమిటీ తుది నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం స్థానిక కళ్యాణ వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వాహకులు కమిటీ సమావేశం జరిగింది. ఈ క్రమంలో 2025 మే 28వ తేదీన గంగ జాతరకు సంబంధించి పట్టణంలో తొలి చాటింపు వేస్తారు. జూన్ 4వ తేదీన రెండో చాటింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో లాయర్ గోపీనాథ్, సోమయ్య శెట్టి, ప్రసాద్, విజయ్ పాల్గొన్నారు.