సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర ఇవాళ్టితో 5వ రోజుకు చేరుకుంది. ఇవాళ అనంతపురం జిల్లా సంజీవపురం నుంచి ఉదయం 9 గంటలకు బస్సుయాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు.