ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని అన్నారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని చెప్పారు. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలని కోరుకున్నారు. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని.. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలి పవన్ ఆకాంక్షించారు.