![పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం](https://media.getlokalapp.com/cache/e6/06/e606fcadf99bff3b04cd822af0492ba2.webp)
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. భారత హోం మంత్రిత్వ శాఖ ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ)లను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. సామాజిక సేవల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.