గ్రంధాలయాధికారి ఇంట్లో భారీ చోరీ

53చూసినవారు
గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీలో గల గజపతినగరం శాఖా గ్రంధాలయ అధికారి యజ్జల స్వప్న ఇంట్లో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్వప్న, భర్త పొందూరు రాము పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి నిద్రించేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 8 తులాల బంగారం, 5 తులాల వెండి, 20 వేల రూపాయల నగదు అపహరించకపోయారు. గజపతినగరం సిఐ ప్రభాకర్, ఎస్ఐ మహేష్ లు గురువారం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్