పేకాట శిబిరంపై పోలీసుల దాడులు

68చూసినవారు
పేకాట శిబిరంపై పోలీసుల దాడులు
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మిదొడ్డి శివారు ప్రాంతంలో పోలీసులు ఆదివారం సాయంత్రం పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి11, 690 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్