విశాఖ: భోగి మంటలో విద్యుత్ బిల్లలు దహనం
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పరవాడ మండలంలో పాత గొర్లవాని పాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు అనకాపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేయడం తగదన్నారు.