డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు

66చూసినవారు
ఏపీలోని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు వినూత్నంగా ఆలోచించారు. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో లైవ్ డ్రోన్ కెమెరాల (లైవ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ టు కమాండ్ కంట్రోల్) ద్వారా ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి ట్రాఫిక్ ఫుటేజీని అధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. గొప్పగా ఆలోచించిన పోలీస్ కమిషనర్‌కు పలువురు అభినందనలు తెలిపారు.