గంజాయి అక్రమ రవాణా నియంత్రణ కు చర్యలు

65చూసినవారు
రాష్ట్రంలో గంజాయినిర్మూలనకు ప్రభుత్వం వందరోజులు యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళుతుందనీ జిఆర్పి డిఎస్పి మోహన్ రావుఅన్నారు. విశాఖ జీఆర్పి స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందన్నారు. ఆర్ ఫి ఎఫ్ తో కలసి విశాఖ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేసి గంజాయిని పట్టుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్