Mar 31, 2024, 14:03 IST/జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకు వినతీ
Mar 31, 2024, 14:03 IST
గొందళీ సమాజ్ సంఘం అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గొందళీ సమాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎక్నాత్ దునిగే వినతిపత్రం అందజేశారు. ఆదివారం సీఎంను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గొందళీ సమాజ్ సంఘం వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.