AP: శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి మైదానం అభివృద్ధి పనులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "9 నెలల్లో మైదానం పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం లాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. నిధుల్లేకుండా అన్ని శాఖలు ఖాళీ చేశారు. మూలపేట పోర్టు ప్రాంతం సందర్శించి నిర్వాసితులకు న్యాయం చేస్తాం. మత్స్యకారులు వలస వెళ్లకుండా చర్యలు చేపడతాం." అని తెలిపారు.