ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి: ఎమ్మెల్యే నాయకర్

69చూసినవారు
మండలంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే నాయకర్ ఆదేశించారు. శనివారం నరసాపురం మండలం లక్ష్మనేశ్వరం గ్రామంలోని రక్షిత మంచినీటి కులాయి చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్