ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య

83చూసినవారు
వరద నీటి ప్రవాహంతో గోదావరి ఉధృతంగా ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ప్రజలను కోరారు. సోమవారం ఆయన ఎలమంచిలి లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ధవలేశ్వరం లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని రెండవ ప్రమాద హెచ్చరిక కూడా రాబోతుందని ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్