కరోనా వైరస్ ప్రభలకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హోమియా మందులు శనివారం పంపిణీ చేశారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు పీపీఎన్ చంద్రరావు చేతుల మీదుగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తల్లాడి సంజయ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.