ముంబైలోని ప్రముఖ మేనేజ్మెంట్ స్కూల్ అయిన సోమయ్య విద్యావిహార్ కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్- ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్దంలో పాలస్తీనావాసులకు అనుకూలంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టిన పోస్ట్లను లైక్ కొట్టినందుకు ప్రిన్సిపాల్ పర్వీన్ షేక్ను డిస్మిస్ చేసింది. తమ విద్యాసంస్థ విలువలకు అనుగుణంగా ప్రిన్సిపాల్ వ్యక్తిగత సోషల్ మీడియా కార్యకలాపాలు లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.