ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కారుమూరి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం ఇరగవరంలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగిందన్నారు.