ఏపీలో NDA అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను తొలగించమని చంద్రబాబు స్పష్టం చేశారు. "టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. రూ.4 వేల పింఛన్కు శ్రీకారం చుడతాం. వాలంటీర్ వ్యవస్థను నేను తొలగించను. వాలంటీర్లలో విద్యావంతులకు రూ.5 వేల కంటే ఎక్కువ ఇచ్చే మార్గం చూపిస్తా. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు చక్రవడ్డీతో సహా రుణం తీర్చేస్తాం." అని చంద్రబాబు అన్నారు.