అడవులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అధికారులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాగాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే కెమెరాలను అడవుల్లో ఏర్పాటు చేసినట్లు IFS సుశాంత్ నందా ట్వీట్ చేశారు. ఒడిశాలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్లో ఏఐ కెమెరాలు తీసిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. ఇవి అడవుల్లో చొరబడిన వారిని, వేటగాళ్లను గుర్తించి నిమిషాల్లోనే ఫొటోలను అధికారులకు పంపిస్తాయి.