పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండల కేంద్రంలోని రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. ఈ గొడవలో ఇద్దరు ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఈ ఘర్షణపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, అవసరమైతే అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది.