తాను టీడీపీలోకి వెళ్లడం లేదని వైసీపీ నేత బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదని ఆమె తెలిపారు. 'జగన్పై మాకు నమ్మకం ఉంది. ఆయన వెంటే నడుస్తాం. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే వార్తలు కూడా వదంతులే. మాకు 40 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్కు అసలు ఓటింగ్ లేదు. అలాంటిది ఆ పార్టీలో వైసీపీని ఎలా విలీనం చేస్తారు?' అని ఆమె వ్యాఖ్యానించారు.