తిరుగుబాటుదారులచే 19 నెలలు బందీగా ఉన్న పైలట్‌కు విముక్తి

66చూసినవారు
తిరుగుబాటుదారులచే 19 నెలలు బందీగా ఉన్న పైలట్‌కు విముక్తి
సుషీ ఎయిర్‌లో పనిచేస్తున్న న్యూజిలాండ్‌కు చెందిన పైలట్‌ ఫిలిప్‌ మార్క్‌ మెహ్ర్‌టెన్స్‌ (38)ను ఇండోనేషియా వేర్పాటువాదులు కిడ్నాప్ చేశారు. 2023 ఫిబ్రవరిలో అపహరించి కల్లోలిత పపువా ప్రాంతంలో అతడిని బందీగా ఉంచారు. ఎట్టకేలకు దాదాపు 19 నెలల తర్వాత శనివారం విడుదల అతన్ని విడుదల చేశారు. ఆ ప్రాంతంలో వేర్పాటు వాదుల కోసం ఏర్పాటు చేసిన కార్టెంజ్ పీస్ టాస్క్‌ఫోర్స్‌కు అతన్ని అప్పగించారు.

సంబంధిత పోస్ట్