మంత్రివర్గంలో కడపజిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం

54చూసినవారు
రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని ఏపీసీసీ మీడియా ఛైర్ మెన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ ఇది కడప జిల్లాకు అవమానకరమని, వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేవని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్