దేశవ్యాప్తంగా 2018-19 నుంచి 2022-23 వరకు 10 లక్షల మోటార్ యాక్సిడెంట్ క్లెయిములు పెండింగ్లో ఉన్నట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. వీటి విలువ రూ.80,455 కోట్లు అని చెప్పింది. సమాచార హక్కు చట్టం కింద సుప్రీంకోర్టు అడ్వకేట్ కేసీ జైన్ చేసిన దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. బాధితులు ఆర్థిక సాయం పొందడానికి సగటున నాలుగేళ్లు పడుతున్నదని కేసీ జైన్ చెప్పారు.