ఏపీలోని చిన్నారుల్లో అరుదైన వ్యాధి

582చూసినవారు
ఏపీలోని చిన్నారుల్లో అరుదైన వ్యాధి
ఏపీలోని పల్నాడులో అరుదైన వ్యాధిని గుర్తించినట్లు గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండంట్ కిరణ్ కుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురం తండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లల రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఆస్పత్రికి వచ్చారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ విభాగం వైద్యుల ప్రయోగశాలలో రక్తపరీక్ష చేయగా.. వారు సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్