ఇజ్రాయెల్తో ఎలాంటి శాంతి ఒప్పందాలు చేసుకోమని హమాస్ తెలిపినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి రఫాపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ లేదా ఖైదీల మార్పిడి ఒప్పందం కోసం ఎటువంటి చర్చల్లో పాల్గొనబోమని మధ్యవర్తులకు హమాస్ తెలిపినట్లు సమాచారం. కాగా రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 45 మంది మృతి చెందారు.