14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది ఇంజనీర్లు సస్పెండ్

61చూసినవారు
14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది ఇంజనీర్లు సస్పెండ్
బీహార్‌లో వరుసగా కూలిపోయిన వంతెనల ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. కూలిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లే ​​బాధ్యత వహించాలని, కొత్తవాటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరింది. బీహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :