వరదలతో 18 మంది మృతి

67చూసినవారు
వరదలతో 18 మంది మృతి
ఈశాన్య భారతంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో భారీ వర్షాలకు 11 జిల్లాల్లో ఆరు లక్షల మంది ప్రభావితమయ్యారు. బరాక్, కోశియారా నదులు ప్రమాద సూచికలను దాటి ప్రవహిస్తున్నాయి. గత నెల 28 నుంచి ఇప్పటివరకు వరదల కారణంగా 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 40 వేల మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. స్థానిక అధికారులు, జాతీయ విపత్తు దళాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.

సంబంధిత పోస్ట్