శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు

982చూసినవారు
శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 64,437 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రూ.5.11 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను టీటీడీ బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్