కల్తీ మద్యం తాగి 20 మంది మృతి

54చూసినవారు
కల్తీ మద్యం తాగి 20 మంది మృతి
మద్యపానం నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఎస్పీ అమితేశ్ కుమార్ వెల్లడించారు. కాగా, ఇటీవల కాలంలో బిహార్‌లో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారాయి. మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ప్రజలు చనిపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.