జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. ఒడిశాలోని కటక్లో జరిగిన ఈ పోటీల్లో ఏపీలోని కాకినాడకు చెందిన శ్రీనాగం ప్రద్యుమ్న జగ్గప్పదొర అండర్-10 సబ్రే విభాగంలో కాంస్యం అందుకున్నాడు. అలాగే హైదరాబాద్కు చెందిన సిద్ధార్థ్, రియాన్షు అండర్-10 కేటగిరీ ఫాయిల్లో సంయుక్తంగా కాంస్య పతకాలు సాధించారు.