రాజస్థాన్ లో 5 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం చేసిన 71 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, రూ.50,000 జరిమానా

50చూసినవారు
రాజస్థాన్ లో 5 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం చేసిన 71 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, రూ.50,000 జరిమానా
రాజస్థాన్ లోని బరాన్ సిటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. 71 ఏళ్ల ఓ వ్యక్తి తన 5 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం చేశాడు. దీంతో స్థానిక పోక్సో కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధించిందని న్యాయవాది తెలిపారు. నిందితుడు గదిలో అత్యాచారానికి పాల్పడుతుండగా అతడిని బాలిక తల్లి మరియు అత్త పట్టుకున్నారు. విచారణ సందర్భంగా 18 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, 24 సాక్ష్యాలను కోర్టుకు సమర్పించామని న్యాయవాది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్