చాందీపురా వైరస్‌తో గుజరాత్‌లో 8 మంది మృతి!

52చూసినవారు
చాందీపురా వైరస్‌తో గుజరాత్‌లో 8 మంది మృతి!
గుజరాత్‌లో చాందీపురా వైరస్‌ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌తో మంగళవారం మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 14 మందికి ఈ వైరస్‌ సోకగా, 8 మంది మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్‌ ప్రకటించారు. రోగుల రక్త నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు మంత్రి వెల్లడించారు. బాధితుల్లో ఫ్లూ లక్షణాలతో జ్వరం, మెదడువాపు వంటివి కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్