ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మందుపాతర పేలి 9 మంది చిన్నారులు మృతి చెందారు. ఆఫ్ఘనిస్థాన్లోని గజ్నీ ప్రావిన్స్లోని గెరు జిల్లాలో ఆదివారం పాత మందుపాతర పేలడంతో తొమ్మిది మంది చిన్నారులు మరణించారని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు మందుపాతరతో ఆడుకుంటున్న సమయంలో అది పేలిందని పేర్కొన్నారు. ఐదుగురు బాలికలతో సహా 4-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు విగతజీవులుగా మారారని తెలిపారు.