ఐపీఎల్-2024లో భాగంగా నేడు రాజస్థాన్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇదిలా ఉండగా ముంబై స్టార్ రోహిత్ శర్మ తన సొంత మైదానంలో చెలరేగేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టీమ్ బస్సుతో కాకుండా తన రేంజ్ రోవర్ కారులో వాంఖడే స్టేడియానికి చేరుకున్నాడు. చివరికి '264' వచ్చే ప్రత్యేక నంబర్ ప్లేట్ గల కారులో రోహిత్ ట్రావెల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.